టీఆర్ఎస్ లో చేరిన ముచ్చర్ల సర్పంచ్
byసూర్య |
Tue, May 17, 2022, 11:51 AM
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు మండలం ముచ్చర్ల సర్పంచ్, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు డాక్టర్ మచంద్రారెడ్డి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన మంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సర్పంచ్ రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ. మంత్రి సబితారెడ్డి సహకారం తో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ లో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందరు దిరాజ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు ఎస్. సురేందర్ రెడ్డి, అందుగుల సత్యనారాయణ, కృష్ణరాంభూపాల్ రెడ్డి, అనేగాని పాండుగౌడ్, దామోదర్ గౌడ్, పులిమామిడి సర్పంచ్ అనితా శ్రీనివాస్, నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి పాల్గొన్నారు.
Latest News