ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం

byసూర్య | Tue, May 17, 2022, 11:54 AM

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామానికి చెందిన బోయపాటి ప్రశాంత్, దివ్య దంపతులు బైక్ పై హైదరాబాద్ వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ సంఘటనలో తమ కూతురు ఈవిక (4) దుర్మరణం పాలైంది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తూరు మండల కేంద్రంలోని జహంగీర్ పీర్ దర్గా చౌరస్తా వద్ద అతివేగంగా వస్తున్న లారీ ప్రశాంత్ ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొంది. ఉదయం ఆరు గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.


అతివేగంగా వస్తున్న ఇటుక లారీ బైకును ఢీకొనగానే డ్రైవర్ పరారయ్యాడు. పాటిగడ్డ గ్రామానికి చెందిన బోయపాటి ప్రశాంత్ హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. భార్య పిల్లలతో స్వగ్రామమైన పాటిగడ్డకు వేసవి సెలవుల కారణంగా వచ్చారు. మంగళవారం తిరిగి తెల్లవారు జామున హైదరాబాద్ బయలుదేరి వెళ్తుండగా దర్గా రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి లారీ కింద పడి నుజ్జునుజ్జు అయ్యింది. అప్పటి వరకు అమ్మానాన్నలతో ఎన్నో కబుర్లు చెప్పిన చిన్నారి అంతలోనే దుర్మరణం పాలవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లి పోయారు. ఈ ప్రమాదంలో బోయపాటి ప్రశాంత్ అతని భార్య దివ్య సైతం తీవ్ర గాయాలు కావడంతో షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రధమ చికిత్స అందిస్తున్నారు. శవాన్ని మార్చురీకి తరలించారు.  ఈ సంఘటనతో పాటిగడ్డ గ్రామంలో విషాదం అలుముకుంది.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM