కరాటే కళ్యాణి కేసు విషయంలో అధికారులు నోటీసులు: కలెక్టర్
byసూర్య |
Mon, May 16, 2022, 04:54 PM
కరాటే కళ్యాణి కేసు విషయంలో అధికారులు నోటీస్ ఇచ్చారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ తెలిపారు. ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి రిప్లై రాలేదని చెప్పారు. మరోసారి నోటీస్ జారీ చేస్తామని, తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పిల్లలను దత్తత తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయని దాని ప్రకారమే దత్తత తీసుకునే ప్రక్రియ వుంటుందన్నారు. ఎవరికి నచ్చినట్లు వారు తీసుకుంటే కుదరదని కలెక్టర్ శర్మన్ స్పష్టం చేశారు. చట్టానికి విరుద్ధంగా వెళ్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు
Latest News