ఆటో కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి

byసూర్య | Wed, Jan 19, 2022, 09:43 PM

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా కడాం మండలం బెల్లాల్ సమీపంలో ఆరుగురితో వెళ్తున్న ఆటో కాలువలో పడింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. క్షతగాత్రులను నిర్మల్ పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం కాలువలోకి దూసుకెళ్లింది. మృతులను సీమల శాంత (55), శంకరవ్వ, మల్లయ్య (55)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM