byసూర్య | Mon, Jan 17, 2022, 06:47 PM
హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ కార్వాన్కు చెందిన బండారి శ్రీనివాస్ మరియు అతని సోదరులు శ్రీ యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి వారి విమాన గోపురానికి బంగారు తాపడం కోసం రూ.50 లక్షలు విరాళంగా అందించారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బాలాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని రూ. 50 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్ను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.గీతకు అందజేశారు. బండారి ఎడ్యుకేషనల్ సొసైటీని బండారి సోదరులు నిర్వహిస్తున్నారు.