byసూర్య | Mon, Jan 17, 2022, 06:17 PM
వర్షాల తో పంట నష్ట పోయిన బాధితులను మరియు పంట నష్టం పరిశీలించడాన్నికి రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన చేయనున్నారు. ఇంకా వచ్చే ఏడాది నుండి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతామని నేడు జరిగిన కాబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ తెలిపారు, ప్రవైట్ స్కూల్స్ లో ఫీజుల నియంత్రణ పై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారo.ఫీజుల కట్టడికి సంబందించి కొత్త కమిటీ తో పాటు కొత్త చట్టం ను కూడా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కాబినెట్ మీటింగ్ లో అధికారులకు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ స్కూల్స్ లో మౌలిక వసతుల కోసం 7289 కోట్లతో మనఊరు- మనబడి కార్యక్రమం ఏర్పాటుకు కాబినెట్ నిర్ణయం తీసుకుంది.