byసూర్య | Mon, Jan 17, 2022, 06:03 PM
మంచిర్యాల ప్రాణహిత నదిలో ముగ్గురు స్టూడెంట్స్ ఈతకు వెళ్లి గల్లంతు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం ఆలుగాంలో విషాదఘటన జరిగింది. ఈతకు వెళ్లిన వంశీవర్ధన్, విజయేంద్ర సాయి, రాకేష్లు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.