పల్లెలు తిరిగి పట్టణాలకు వస్తున్నాయి...హైదరాబాద్ పెరిగిన ట్రాఫిక్

byసూర్య | Mon, Jan 17, 2022, 02:24 PM

పండుగలకు పట్టణాలు పల్లెలకు పోవడంతో హైదరాబాద్ నగరం దాదాపు ఖాళీ అయింది. ఇపుడు పండగ అయిపోయింది. దీంతో పల్లెలు మళ్లీ మహానగరానికి చేరుకొంటున్నాయి. దీంతో మళ్లీ హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరిగింది. సంక్రాంతి పండగకు ముందు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తరలివెళ్లే ప్ర‌జ‌ల‌తో రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండులు కిక్కిరిసిపోయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చే ప్ర‌యాణికుల‌తో మ‌ళ్లీ రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్ల‌లో ర‌ద్దీ నెల‌కొంది. ప్రజలు హైద‌రాబాద్‌కు తిరుగు పయనమవడంతో నేడు హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేటు వద్ద మీదుగా నిన్న‌ 35 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించినట్టు తెలిసింది. అలాగే, ఆ టోల్‌గేట్ మీదుగా ఈనెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సుమారు 4 లక్షలకు పైగా వాహనాల రాకపోకలు సాగించినట్లు సమాచారం. రద్దీ పెరిగిన నేప‌థ్యంలో పంతంగి టోల్ ప్లాజాతో పాటు నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద అదనపు టోల్ చెల్లింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధార‌ణ రోజుల్లో కంటే వాహ‌నాల రాక‌పోక‌లు భారీగా పెరిగాయి.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM