byసూర్య | Sun, Jan 16, 2022, 11:20 PM
హైదరాబాద్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.శేరిలింగంపల్లిలోని గల్లా అపర్ణ సరోవర్ భవన్లో చోటుచేసుకుంది. అద్వైత్ (13) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.అయితే అద్వైత్ సరిగా చదవలేదని అతని నాన్న మందలించాడు. దీంతో అద్వైత్ మనస్థాపానికి గురయ్యాడు. నాన్న మందలించడంతో అద్వైత్ అపర్ణ సరోవర్ భవనంలోని 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు చెబుతున్నారు.అయితే ఆన్ లైన్ క్లాసులు చూడడం లేదని, సరిగా చదవడం లేదని అద్వైత్ నాన్న మందలించినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో అద్వైత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.