byసూర్య | Fri, Jan 14, 2022, 12:22 AM
తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ తొలి డోస్ 100 శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని ఆరోగ్య మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తెలంగాణ ఇప్పుడు టీకాలు వేయడంలో మరో మైలురాయిని చేరుకుందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ 5 కోట్ల డోస్లు దాటింది. వ్యాక్సిన్ల పంపిణీ 5 కోట్ల డోస్లు దాటడంపై ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఉంటూ నిరంతరం టీకాలు వేసేందుకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందితో పాటు పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల సిబ్బందిని మంత్రి హరీశ్ రావు అభినందించారు.