byసూర్య | Fri, Jan 14, 2022, 09:34 AM
తాడేపల్లిగూడెం అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.విశాఖ జిల్లా దువ్వాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చేపల లోడుతో లారీ వెళ్తోంది. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు జాతీయ రహదారి 216 వద్దకు రాగానే అదుపుతప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే బిహార్కు చెందిన నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు.