తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం

byసూర్య | Fri, Jan 14, 2022, 09:34 AM

తాడేపల్లిగూడెం అర్బన్‌: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.విశాఖ జిల్లా దువ్వాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చేపల లోడుతో లారీ వెళ్తోంది. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు జాతీయ రహదారి 216 వద్దకు రాగానే అదుపుతప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే బిహార్‌కు చెందిన నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్‌ నిద్ర మత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు.


Latest News
 

బోర్లంలో ఇంటింటి ప్రచారం Wed, Apr 24, 2024, 01:08 PM
విద్యుత్తు షాక్‌తో గేదె మృతి Wed, Apr 24, 2024, 01:06 PM
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ Wed, Apr 24, 2024, 01:04 PM
కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన మున్నూరు కాపులు Wed, Apr 24, 2024, 01:01 PM
ఇంటర్ ఫస్టియర్ లో మహబూబ్ నగర్ కు 20.. నారాయణపేటకు 34వ స్థానం Wed, Apr 24, 2024, 12:55 PM