ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ లీడ్ ఎంతంటే?
byసూర్య |
Thu, Jan 13, 2022, 12:26 PM
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసింది. స్టంప్స్ సమయానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా(9*), కోహ్లీ(14*) ఉన్నారు. టీమిండియా ఓపెనర్లు రాహుల్ (10), మయాంక్ (7) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ప్రస్తుతం భారత్ 70 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 223, దక్షిణాఫ్రికా 210 పరుగులు చేశాయి. దీంతో భారత్ కి తొలి ఇన్నింగ్స్ లో 13 పరుగుల ఆధిక్యం లభించింది.
Latest News