byసూర్య | Wed, Jan 12, 2022, 12:45 PM
నల్గొండ జిల్లా: నకిరేకల్కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నవంబర్ 1న నకిరేకల్కు చెందిన పి.సాయితేజ(21) పురుగుల మందు తాగి.. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేటలోని ఓ ప్రయివేటు కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న అతడు మానసిక వేదనతో మృతి చెందాడనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.