byసూర్య | Wed, Jan 12, 2022, 11:43 AM
సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఫిలిప్స్ లైట్స్ లాంజ్ షోరూమ్, గోదాంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్స్ కారణంగా మంటలు చెలరేగడంతో మొదటి అంతస్తు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.