byసూర్య | Tue, Jan 11, 2022, 02:04 PM
భారత్-దక్షిణాఫ్రికా సిరీస్లో నిర్ణయాత్మక మూడో టెస్టు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ సఫారీలకు బౌలింగ్ అప్పగించింది. వెన్ను నొప్పి కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇరు జట్లు ఇప్పటి వరకు జరిగిన ప్రతి రెండు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేశాయి. దీంతో మూడో టెస్టు రసవత్తరంగా సాగనుంది. పైచేయి సాధించిన జట్టు సిరీస్ను సొంతం చేసుకుంటుంది. రెండో టెస్టులో గాయపడిన మహ్మద్ సిరాజ్ స్థానంలో సీనియర్ బౌలర్ ఉమేష్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు.
భారత జట్టు: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానె, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్.
దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మర్క్రమ్, కీగన్ పీటర్సన్, రస్సీ వాండర్ డస్సెన్, తెంబా బవుమా, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, ఒలివర్, లుంగి ఎంగిడి.