byసూర్య | Thu, Nov 25, 2021, 01:54 PM
వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై దాడిచేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.ఆయన వివరాల ప్రకారం అమీన్పూర్ పరిధి నరేంద్రకాలనీలో ఓ అపార్ట్మెంట్లో మహిళ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడిచేసి, విటులు జగదీశ్ సింగ్, మోహన్ను, ఇద్దరు యువతులతో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పటేల్గూడ భెల్మెట్రో కాలనీలో మరో ఇంటిపై దాడిచేసి, విటుడు అరవింద్ను, ఓ యువతిని అదుపులోకి తీసుకుని, విటులు ముగ్గురిని రిమాండ్ తరలించినట్లు ఆయన తెలిపారు.