byసూర్య | Wed, Nov 24, 2021, 02:47 PM
నగర శివార్లలోని కీసర ఔటర్ రింగ్రోడ్పై ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు, లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది