byసూర్య | Tue, Nov 23, 2021, 12:41 PM
గాల్వన్ లోయలో చైనా సైనికులతో పోరాడి వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేట నివాసి కల్నల్ సంతోష్ బాబును కేంద్రం మహావీర్ చక్ర అవార్డుతో సత్కరించింది. ఆయన మరణానంతరం ప్రభుత్వం ఆయనకు మహావీర చక్ర అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ సతీమణి, ఆయన తల్లి అవార్డును అందుకున్నారు. గాల్వన్ వ్యాలీ వద్ద భారత్-చైనాల మధ్య జరిగిన ఘర్షణల్లో సంతోష్ బాబు సహా కనీసం 21 మంది భారత సైనికులు మరణించారు. ఆయన సేవలకు గుర్తుగా కేంద్రం మరణానంతరం మహావీర చక్ర అవార్డును ప్రకటించింది. సంతోష్బాబుతో పాటు విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన పలువురు సైనికులకు అమరవీరుల కుటుంబాలకు రాష్ట్రపతి గ్యాలరీ అవార్డులను అందజేశారు.