byసూర్య | Wed, Oct 27, 2021, 08:05 AM
ఆర్టీసీ "పెళ్లి సందడి"కి ముస్తాబైంది. నష్టాల బాట వీడి లాభాల కోసం తహతహలాడుతున్న టీఎస్ఆర్టీసీ, అందివచ్చే ప్రతి అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలనుకుంటోంది. ఇందుకోసం పెళ్లిళ్ల సీజన్ను బాగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. పెళ్లిళ్లకు బస్సులను అద్దెకిచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ప్రారంభం కావటంతో బస్సులను అద్దెకు తీసుకొమ్మంటూ ముమ్మర ప్రచారం చేస్తోంది. నవంబరు నుంచి కనీసం రోజుకు వంద బస్సులు అద్దెకిచ్చేలా టార్గెట్ పెట్టుకుంది. పెళ్లివారిని ఆకట్టుకునేందుకు గాను, సెక్యూరిటీ డిపాజిట్ను రద్దు చేసింది. మొత్తం చార్జీలో 20 శాతాన్ని అడ్వాన్సుగా చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్నీ రద్దు చేయటంతో ప్రైవేటు బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల వైపు పెళ్లింటివారు మొగ్గుచూపుతున్నారు. ఆదివారం నుంచి ఈనెల 31 వరకు ఉన్న పెళ్లిళ్లకు ఇప్పటికే 225 బస్సులు బుక్ అయ్యాయి.