రాజేంద్రనగర్‌లో ఏటీఎంలో చోరీకి దుండగుల యత్నం

byసూర్య | Mon, Oct 25, 2021, 07:50 PM

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో దుండగులు రెచ్చిపోయారు. ఇనుప రాడుతో ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేసారు. రాజేంద్రనగర్ అత్తాపూర్ చౌరస్తాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎమ్ సెంటర్లో చోరీకి విఫల యత్నం చేసారు. అర్థరాత్రి ఇనుపరాడ్డుతో ఏటీమ్ మిషన్‌ను తెరిచేందుకు దుండగుడు ప్రయత్నం చేశాడు. పలుమార్లు రాడ్డుతో బాదాడు. ఎంత చేసినా ఏటీఎం తెరతెరుచుకోక పోవటంతో అగంతకుడు ఉడాయించాడు.


గత రెండు,మూడు రోజులుగా ఈ ఏటీఎంలో చోరీ కోసం అగంతకుడు రెక్కీ నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ బృందాలు ఆధారాలను సేకరిస్తున్నాయి. కేసు నమోదు చేసుకుని రాజేంద్రనగర్ క్రైమ్ బృందం దర్యాప్తు చేస్తో్ంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM