byసూర్య | Sun, Oct 24, 2021, 01:30 PM
నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రెండు రోజులుగా పలు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడంతో చలితీవ్రత పెరిగింది. శనివారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33.2 డిగ్రీలు ఉండగా, కనిష్ఠం సాధారణం 20.0 కంటే ఒక డిగ్రీ (19.0) తక్కువగా ఉంది. ఎల్బీనగర్లో 17.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజేంద్రనగర్లో 17.9, సికింద్రాబాద్లో 18.0, పటాన్చెరులో 18.4, బేగంపేట్లో 19.0, మల్కాజిగిరిలో 19.1, చందానగర్లో 19.2, సరూర్నగర్లో 19.5 డిగ్రీలు నమోదయ్యాయి. దీంతో శివారు ప్రాంతాల్లోని రోడ్లపై తెల్లవారుజామున పొగమంచు కురుస్తోంది.