byసూర్య | Sun, Oct 24, 2021, 01:32 PM
నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కారు టైరు పగిలి డివైడర్ను దాటుకుని లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా...మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు, క్షతగాత్రులు మోర్తాడ్ మండలం పాలెం వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.