byసూర్య | Sun, Oct 24, 2021, 01:34 PM
నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 59,436 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 55,978 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ 311.4474 టీఎంసీలుగా కొనసాగుతోంది.