15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి: షబ్బీర్‌ అలీ

byసూర్య | Sun, Oct 24, 2021, 12:05 PM

తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో తొలిసారి సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా జరుగుతోన్న ఉప ఎన్నికగా హుజూరాబాద్ పోరు కు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తుండగా, ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ సైతం దూకుడు పెంచింది. అయితే, బీజేపీ-కాంగ్రెస్ తోడు దొంగలని, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య జరిగిన రహస్య భేటీనే అందుకు సాక్ష్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  ఆరోపించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. తామిద్దరం కలిసినమాట వాస్తవమేనని, అయితే అది మే నెలలో జరిగిన భేటీనేకానీ, ఎన్నికల ప్రకటన తర్వాత కాదని ఈటల, రేవంత్ వివరణ ఇచ్చుకున్నా టీఆర్ఎస్ విమర్శలు చేస్తూనే ఉంది. ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పై మండిపడుతోన్న కాంగ్రెస్ నేతలు ఓ సరికొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. అదేంటంటే..


హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముగిసిన వెంటనే సుమారు 15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ బాంబు పేల్చారు. హుజూరాబాద్ లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, కాబట్టే గులాబీ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని, పరిస్థితిని అర్థం చేసుకున్న కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుకే పార్టీని వీడబోతున్నారని షబ్బీర్ అలీ చెప్పారు.


బీజేపీ నేత ఈటలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ భేటీని 'గాంధీ భవన్ లో గాడ్సే'గా టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న క్రమంలో, 'ప్రగతి భవన్ లో తెలంగాణ ద్రోహులు'అంటూ కాంగ్రెస్ కౌంటర్లు వేస్తోంది. షబ్బీర్ అలీ మరో అడుగు ముందుకేసి.. 'ప్రగతిభవన్‌లో గాడ్సే కొత్త అవతారం విశ్రాంతి తీసుకుంటోంది. గాడ్సేకు పెద్ద శిష్యుడు లాంటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను దాదాపు ప్రతివారం సీఎం కేసీఆర్‌ ఎందుకు కలుస్తారో సమాధానం చెప్పాలి'అని షబ్బీర్ అలీ డిమాండ్‌ చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM