byసూర్య | Tue, Jun 08, 2021, 02:11 PM
ధర్మానికి, అధర్మానికి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందని.. సీఎం కేసీఆర్కు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్ ప్రజలు సిద్ధమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వరంగల్లో నేడు ఆయన రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ నుంచే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తానని ఆయన వెల్లడించారు. అక్రమ సంపాదనతో ఓటర్లను మభ్య పెడుతున్నారన్నారు. అధికార పార్టీ నేతల కుట్రలను ఇక్కడి ప్రజలు తిప్పికొడతారన్నారు. ప్రగతి భవన్ స్క్రిప్టు చదివే వారి గురించి మాట్లాడనని ఈటల స్పష్టం చేశారు.