byసూర్య | Fri, Jun 04, 2021, 11:02 AM
ఉద్యమ నాయకులను గెలిపించిన చరిత్ర కరీంనగర్ జిల్లాకు ఉంది. కేసీఆర్ కుట్రలు, డబ్బు, అణిచివేతను నమ్ముకున్నాడు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు.. కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు. ఉప ఎన్నికల్లో డబ్బు సంచులతో గెలవచ్చు.. గ్యాప్ ఇవాళ రాలేదు.. ఐదేళ్ల క్రితమే వచ్చింది. హరీశ్రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. కేసీఆర్ను కలవడానికి ఎమ్మెల్యేలం అందరం వెళితే గేట్ దగ్గరే ఆపేశారు. రెండో సారి అపాయింట్ మెంట్ తీసుకుని పోయాం. రెండోసారి కూడా గేట్ల నుంచే బయటకు పంపించారు. మూడోసారి అలాగే జరిగితే కోపంగా వెళ్లి గోళీలు ఇచ్చే ఎంపీ సంతోష్ను అడిగాను. అది ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్ అని పేరు పెట్టుకోవాలని చెప్పా. సీఎంవోలో ఒక్క బీసీ కానీ.. ఎస్సీ అధికారి ఉన్నారా? బానిస కంటే అధ్వాన్నంగా ఉన్న మంత్రి పదవి ఎందుకు? రాష్ట్రం కోసమే ఇన్నాళ్లు అవమానాలు భరించా. వైద్య మంత్రి లేకుండానే సమీక్షలు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో సంఘాలు కావాలి.. ఇప్పుడు సంఘాలు వద్దా? బొగ్గు గనులతో సంబంధం లేని వ్యక్తులు ఆ సంఘాన్ని నడుపుతున్నారు'' అని విమర్శించారు.