byసూర్య | Thu, Jun 03, 2021, 02:44 PM
హైదరాబాద్ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చాలా మండలాల్లో ఈ ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్నది. భారీ వర్షానికి వరద పోటెత్తి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అశ్వాపురం మండలంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి తుమ్మలచెరువు చింతలగుంపు వద్ద వాగు పొంగిపొర్లుతున్నది. దీంతో మొండికుంట నుంచి తుమ్మలచెరువు, వెంకటాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.