byసూర్య | Sat, Apr 10, 2021, 11:54 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామంలో వృద్ధ దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. కోట్ల ఆస్తి ఉంది నలుగురు కొడుకులు, మనవళ్లు ఉన్న పలకరించే దిక్కు లేక వృద్దాప్యం పెరిగితే మంచం మీదే కుళ్ళి పోవలిసి వస్తుందని మనోవేదన చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దూపకుంట్ల నాగభూషణం (75), దుపకుంట్ల ఆదిలక్ష్మి (70) అనే వీరికి నలుగురు కొడుకులు వున్నారు. ఎంతో కష్టపడి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకి పెళ్లిళ్లు చేసి వృద్ధిలోకి తీసుకొచ్చారు. వారంతా వేరే ఊళ్లలో స్థిరపడ్డారు. కానీ తల్లిదండ్రులు ఆరోగ్య స్థితిగతులు పట్టించుకునే కాళిలేదు. నాగభూషణం దంపతులకు దగ్గరలో కాలక్షేపం చేయడానికి స్నేహితులు కూడా ఎవరు లేరు. కొడుకులు, కొడళ్ళు, మనవళ్లు ఉన్న వీరితో గడపడానికి కాళిలేదు. కనీసం ఫోన్ లో కూడా సరిగా ఎవరు మాట్లాడటం లేదని చుట్టుపక్కల వారి దగ్గర ఆవేదన వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన చెంది మనస్తాపంతో అర్థరాత్రి సమయంలో సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకొని ప్రాణాలు విడిచారు. ఇది తెలుసుకున్న పోలీసులు ఘటనా స్టాలినికి వెళ్లి విచారిస్తున్నారు.