byసూర్య | Sat, Apr 10, 2021, 09:05 AM
కరోనాతో రాష్ట్ర ప్రజలు భయబ్రాంతులకు గురవుతుంటే షర్మిల సభకు ఎలా అనుమతిస్తారు.? అని డీజీపీ మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ మాజీ ఎంపీ హనుమంతరావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్ షోలకు ఎందుకు అనుమతిచ్చారు ఈ ప్రశ్నలకు డీజీపీ సమాధానం చెప్పాలని తెలిపారు. మేము ఎక్కడికి వెళ్లినా అనుమతివ్వరు. వాళ్లకోక న్యాయం మాకొక న్యాయమా..? అని ప్రశ్నించారు. షర్మిల ఏమైనా చేయాలనుకుంటే ఆంధ్రాలో చేస్కోవాలి. విజయమ్మ ఆంధ్రలో కొడుకు, తెలంగాణలో కూతురు ఉండాలని అనుకుంటున్నారా.? అని వీహెచ్ ఒకింత ఎద్దేవా చేశారు.