టీకా ఉత్సవ్‌ పై ప్రజల్లో అవగాహన తీసుకురావాలి: కిషన్ రెడ్డి

byసూర్య | Sat, Apr 10, 2021, 08:37 AM

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా కరోనా మహమ్మారిపై విజయం సాధించలేమని, అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని కిషన్ రెడ్డి కోరారు. కరోనా టీకా వేయించుకున్నవారు నిర్లక్ష్యం వహించవద్దన్నారు. టీకా ఉత్సవ్‌పై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.


Latest News
 

ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Tue, Apr 23, 2024, 12:50 PM
ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయ పునర్ నిర్మాణ పనులు Tue, Apr 23, 2024, 12:35 PM
యాదాద్రి స్వామి వారి హుండీల లెక్కింపు ప్రారంభం Tue, Apr 23, 2024, 12:35 PM
డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి Tue, Apr 23, 2024, 12:33 PM
ఉపాధి హామీ పథకం టీఏ సస్పెండ్ Tue, Apr 23, 2024, 12:31 PM