byసూర్య | Fri, Apr 09, 2021, 02:50 PM
నల్గొండ జిల్లా దామరచర్ల మండల శివారులోని శూన్యపాడు వద్ద శుక్రవారం ఉదయం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జానపాడు దర్గాలో మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులది గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం మాదల గ్రామానికి చెందిన గ్రామస్థులుగా గుర్తింపు.