byసూర్య | Wed, Apr 07, 2021, 12:37 PM
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారుతి కారు అతి వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదురుగా జరిగింది. మృతుడిని రామచందర్(48) అనే వ్యక్తిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.