byసూర్య | Wed, Apr 07, 2021, 12:32 PM
జాతీయ ఛాంపియన్గా నిలిచిన తెలంగాణ బేస్బాల్ జట్టును మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్ రవీంద్రభారతిలోని తమ కార్యక్రమంలో అభినందించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన జాతీయ సీనియర్ బేస్బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ విజేతగా నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 11-6తో ఢిల్లీపై విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.