byసూర్య | Wed, Mar 31, 2021, 12:38 PM
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు నిరుద్యోగుల శాపం తగులుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. గాంధీభవన్ లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..ఆత్మహత్యలతో ఉద్యోగాలు రావని ప్రాణాలతో ఉంటూ కేసీఆర్తో పోరాడి సాధించుకుందామని దాసోజు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు చేయడం లేదని మానసిక క్షోభకు గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ను ఆయన పరామర్శించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరమని తెలిపారు. సునీల్కు జరగరానిది జరిగితే అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అవుతుందన్నారు.