byసూర్య | Wed, Mar 31, 2021, 11:57 AM
హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానంలో ఏప్రిల్ 1న తలపెట్టిన గో మహాగర్జనకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్, టిటిడి సభ్యుడు శివకుమార్ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. అత్యవసర వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు పిటిషన్పై విచారణ చేపట్టింది. కొవిడ్ తీవ్రత కారణంగా అనుమతి రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమతిచ్చారన్న కారణంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటామని పిటిషనర్ తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం 400 మందికి మించకుండా కార్యక్రమం నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది.