హైకోర్టు కీలక నిర్ణయం

byసూర్య | Wed, Mar 31, 2021, 11:57 AM

హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానంలో ఏప్రిల్ 1న తలపెట్టిన గో మహాగర్జనకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్, టిటిడి సభ్యుడు శివకుమార్ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. అత్యవసర వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు పిటిషన్​పై విచారణ చేపట్టింది. కొవిడ్ తీవ్రత కారణంగా అనుమతి రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమతిచ్చారన్న కారణంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటామని పిటిషనర్ తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం 400 మందికి మించకుండా కార్యక్రమం నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది.


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM