byసూర్య | Wed, Mar 31, 2021, 12:02 PM
సికింద్రాబాద్లోని అయిర్ అషియే ఆఫీస్ ఎదురుగా భవనంలోని మొదటి అంతస్తులో మంగళవాళరం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ భవనంలో నివస్తున్న ప్రజలు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. మంటలు వ్యాపించడాన్ని గమనించి భవనంలో ఉన్న వారిని అలెర్ట్ చేసి వెంటనే స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలు పూర్తిగా అదుపు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.