byసూర్య | Tue, Jan 19, 2021, 08:53 AM
సిరిసిల్ల: జిల్లాలోని గంభీరావుపేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైక్లు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ముస్తఫానగర్లో ఒగ్గు కథ చెప్పి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విషయంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలను వెల్లడించారు. మృతులు చిప్పలపల్లికి చెందిన ముచ్చర్ల దేవయ్య, నామాపూర్కు చెందిన గడ్డి ఆడవయ్యలుగా పోలీసులు గుర్తించారు.