byసూర్య | Fri, Jan 15, 2021, 02:52 PM
తెలంగాణలో పార్టీని మరింత బలో పేతం చేసేందుకు గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 17 తర్వాత ఆయన జిల్లాలలో పర్యటనించనున్నారని సమాచారం.అందుకే పార్టీ కార్యాలయ నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేశారట. క్షేత్ర స్థాయిలో పర్యటించి అక్కడ ఎంపిక చేసిన కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. ఆ ట్రెనింగ్ కార్యక్రమం జూన్ లోపు పూర్తి అయ్యేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.