నేడు ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

byసూర్య | Tue, Jan 12, 2021, 11:02 AM

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నది. నేడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్తుండడం హాట్‌ టాపిక్‌గా మారింది. త్వరలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక మొదలుపెట్టింది తెలంగాణ కాంగ్రెస్‌. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు... ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కమిటీలపై కూడా చర్చ జరిగింది. వీటికి సంబంధించి ఎన్నికలు, మేనిఫెస్టో కమిటీల్ని వేయాలని నిర్ణయించారు. ముఖ్య నాయకులు... డీసీసీ అధ్యక్షులతో సమావేశమై చర్చించారు ఉత్తమ్‌. ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే... రంగారెడ్డి.. హైదరాబాద్.. పాలమూరు నియోజకవర్గం నుండి ... మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి , వంశీ పేర్లతో పాటు... ఉపాధ్యాయ సంఘం నుండి హర్ష వర్ధన్ పేరు కూడా హైకమాండ్‌కు పంపుతున్నారు. ఇక..వరంగల్..ఖమ్మం.. నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుండి... మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, బెల్లయా నాయక్ పేర్లు చర్చకు వచ్చాయి.


 


అటు మానవతా రాయ్ పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో ఇవాళ ఉత్తమ్‌ ఢిల్లీ వెళ్తుండడంతో హైకమాండ్‌తో ఏం చర్చిస్తారన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తే.. ఇక కార్పొరేషన్ ఎన్నికలపై నజర్ పెట్టాలని చూస్తోంది టీ కాంగ్రెస్‌.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM