నా పరిశోధన పోలీసులకు ఉపయోగపడుతుంది : డీజీపీ మహేందర్ రెడ్డి

byసూర్య | Sun, Oct 18, 2020, 11:44 AM

పోలీసింగ్, సమాజ భద్రతలో సమాచార సాంకేతికత వినియోగంపై పదేళ్లుగా అధ్యయనం చేసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తాజాగా పీహెచ్‌డీ పట్టా అందుకుని విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. జేఎన్‌టీయూహెచ్ తొమ్మిదవ స్నాతకోత్సవంలో ఆయనకు ఆ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ జయేశ్‌రంజన్ పట్టాను అంద‌జేశారు.


ఈ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ వర్చువల్ పద్ధతిలో రాజ్ భవన్ నుంచి పాల్గొన్నారు. కాగా, తన పీహెచ్‌డీ పూర్తి చేయడంలో సాయపడ్డ గైడ్ తో పాటు ఇతర సభ్యులకు మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన పరిశోధన రాష్ట్ర పోలీసులకు ఉపయోగపడుతుందని చెప్పారు. పీహెచ్‌డీ పట్టా అందడం పట్ల సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM