లాభాల్లో ముగిసిన మార్కెట్లు

byసూర్య | Fri, Oct 16, 2020, 05:02 PM

యూరప్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో నిన్న మన స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 1,066 పాయింట్లు పతనమైంది. అయితే నిన్నటి భారీ కుదుపు నుంచి మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. వారాంతంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.


ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 39,983కి పెరిగింది. నిఫ్టీ 82 పాయింట్లు పుంజుకుని 11,762కి చేరుకుంది. ఈరోజు ఎనర్జీ సూచీ మినహా ఇతర అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:


టాటా స్టీల్ (5.38%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.55%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (92.38%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.23%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (2.10%).


టాప్ లూజర్స్:


హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.76%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.72%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.36%), ఏసియన్ పెయింట్స్ (-1.17%), నెస్లే (-1.02%).


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM