byసూర్య | Tue, Oct 13, 2020, 03:22 PM
ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏ అధికారి ప్రజల కోసం పని చేయడం లేదని విమర్శించారు. పోలీసులు తాము ఉద్యుగులమన్న విషయాన్ని మర్చిపోయారు. వాళ్లు ఐపీఎస్ కాదని, కేపీఎస్.. కల్వకుంట్ల ప్రైవేట్ సైన్యంలా తయారు అయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ ఓటమి పాలైనప్పుడు యూత్ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా పోరాటాలు చేసిందని, తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. తమ పోరాటాలు ప్రజల కోసమేనని, సమస్యల పరిష్కారలో ముందుండాలని యువజన కాంగ్రెస్కు పిలుపునిచ్చారు.