byసూర్య | Tue, Oct 13, 2020, 02:37 PM
నిజామాబాద్ జిల్లాలోని పూసలగల్లీలో దొంగబాబాకు దేహశుద్ధి జరిగింది. వైద్యం పేరుతో బాలికకు మత్తు ఇచ్చిన దొంగ బాబా.. ఆమెపై 3 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అంతే కాకుండా తల్లిదండ్రులకు చెబితే చంపుతానని బాలికను బెదిరించాడు. దొంగబాబా బెదిరింపులకు హడలిపోయిన బాలిక.. ఈ దారుణం బయటికి కక్కలేదు. బాలికకు ఉన్నట్టుండి కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అది మామూలు కడుపు నొప్పి కాదని తెలియడంతో దొంగబాబా అసలు రంగు బయటపడింది. అనంతరం దొంగబాబాను మహిళలంతా చితకబాదారు.