byసూర్య | Sat, Apr 04, 2020, 02:42 PM
తెల్ల రేషన్ కార్డు దారులకు ఈ నెల మొత్తం బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బియ్యం రావడం లేదని ఎవరు ఆందోళన చెందవద్దని.. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 12 కిలోలు చొప్పున బియ్యం పంపిణీ చేసేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. బియ్యం పంపిణీపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు పడుతూ గంటల తరబడి రేషన్ షాపుల వద్ద క్యూ లైన్ లలో నిలడవద్దు. గుంపులు గుంపులుగా రేషన్ షాప్ ల వద్దకు చేరుకోవడం వలన సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. బయోమెట్రిక్ సర్వర్ ప్రాబ్లమ్స్ ఏర్పడటం వలన బియ్యం పంపిణీలో కొంత జాప్యం జరుగుతుంది. సర్వర్ ప్రాబ్లమ్స్ ను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే మ్యానువల్ విధానంలో బియ్యం పంపిణీ చేసే ఆలోచనను ప్రభుత్వం చేస్తుందని ఆయన తెలిపారు.