byసూర్య | Wed, Apr 01, 2020, 11:26 AM
కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఆటో డ్రైవర్లు, కార్మికులకు ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నారు. చైతన్య పురి డివిజన్ పరిధిలో సుమారు 60 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు ఎల్బీనగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు తోట మహేష్ యాదవ్, మార్వాడీ సమాజ్ ప్రతినిధుల సహాయం తో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కె వి నియోజకవర్గ ఇంచార్జి శ్రావణ్, మార్వాడీ సమాజ్ ప్రతినిధులు అశోక్ జైన్, సురేష్ జైన్, మల్లేష్ యాదవ్, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.