byసూర్య | Tue, Mar 31, 2020, 08:11 AM
రైస్ మిల్లర్లకు ఇకపై అధికారుల నుంచి వేధింపులు ఉండవని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ రోజు ప్రగతి భవన్లో రైస్ మిల్లర్ల అసోసియేషన్ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రైస్ మిల్లర్లకు సరైన మార్కెటింగ్ వ్యూహం ఉండాలని మిల్లర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. ఏ రాష్ట్రాల ప్రజలు ఏ రకం బియ్యం వాడతారో రైస్ మిల్లర్లకు స్పష్టత ఉండాలని అన్నారు. కరోనా కారణంగా కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లారని.. సీజన్ వచ్చింది కాబట్టి వారిని ప్రత్యేక బస్సుల్లో రప్పించే ప్రయత్నం చేయనున్నట్లు మిల్లర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుడా సహకరించాలని రైతు మిల్లర్ల అసోసియేషన్ నేతలను సీఎం కోరారు.