byసూర్య | Mon, Mar 30, 2020, 01:18 PM
మేడ్చల్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ను పట్టించుకోకుండా మాస్క్ లేకుండా బయట తిరిగే వారికి జరిమానా విధించినట్లు మునిరాబాద్ గ్రామ సర్పంచ్ గణేష్ తెలిపారు. మునిరాబాద్ గ్రామంలో అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రాకూడదని.. ఒకవేళ వచ్చినా ముఖానికి మాస్క్ తప్పకుండా ధరించాలని గ్రామ సర్పంచ్ గణేష్ తెలిపారు. అయితే గ్రామ సర్పంచ్ మాటలను లెక్కచేయకుండా అనవసరంగా మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులకి 2 వేల రూపాయలు జరిమానా విధించారు.