byసూర్య | Thu, Jan 16, 2020, 02:23 PM
డెంగీ, మలేరియా తదితర రోగాల బారి నుంచి స్థానికులను రక్షించే క్రమంలో దోమల నివారణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఇన్ ఛార్జి దిలీప్ నాడే ఆధ్వర్యంలో గుఫానగర్, ఇందిరానగర్, ఆర్కె పేట్, కిస్తీ చమన్, మంగళ హాట్ తదితర ప్రాంతాల్లో డ్రైవ్ కొనసాగింది. ఈ సందర్భంగా సుమారు ఎనిమిది బృందాలు రెండు వందలకు పైగా ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. దోమల నివారణ మందు చల్లారు. దోమలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై స్థానికులకు అవగాహన కల్పించారు.