byసూర్య | Tue, Jan 14, 2020, 08:09 PM
జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని పలు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్పొరేషన్ పరిధిలోని డ్రైనేజీలు, రోడ్లు, వీధి దీపాల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లాయని.. వాటితో తమ గెలుపు సులభం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.