byసూర్య | Mon, Jan 13, 2020, 05:22 PM
జూబ్లీహిల్స్ పబ్లో రేవ్ పార్టీ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సేల్స్ పెంచుకునేందుకు డాక్టర్లు, ఉద్యోగుల కోసం ఓ ఫార్మా కంపెనీ పబ్ను బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. 22 మంది యువతులతో నగ్న నృత్యాలు, వ్యభిచారం నిర్వహిస్తున్న ఈవెంట్ ఆర్గనైజర్ ప్రసాద్ ప్రతి ఏటా రేవ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ యువతులంతా నెల్లూరుకు చెందిన వారు. సినిమా అవకాశాలు, ఈవెంట్స్లో డ్యాన్స్ చేసేందుకు వచ్చిన యువతులు వ్యభిచార రొంపిలోకి దిగారు. ఫార్మా కంపెనీ పేరును పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.